సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవితో కరుణించారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. చాలా సంవత్సరాలుగా ఆయన ఈ పదవి మీద ఆశలతో ఉన్నారు. అయితే ఆ ఆశలు నెరవేరలేదు. ఆ మధ్య రాజ్యసభ మెంబర్ షిప్ మీదే సోమిరెడ్డి ఆశలు పెట్టు కొన్నాడు. అయితే ఆ అవకాశాన్ని బీజేపీ నుంచి వచ్చిన నిర్మలా సీతారామన్ తన్నుకుపోయారు! ఇలాంటి నేపథ్యంలో చివరకు ఎమ్మెల్సీ పదవి దక్కితే అదే చాలని సోమిరెడ్డి ఫీలయ్యారు.
కనీసం ఆ కోరిక అయినా ఇప్పుడు నెరవేరుతోంది. బాబు ఈ తెలుగుదేశం సీనియర్ నేతకు ఆ హోదాను ఇస్తున్నాడు. తెలుగుదేశం తరపున సోమిరెడ్డి ఎంతగా కష్టపడతాడో వేరే వివరించనక్కర్లేదు. తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి జగన్ మోహన్ రెడ్డిపై సోమిరెడ్డి తరచూ దుమ్మెత్తిపోస్తూ ఉంటాడు. అనేక రకాల విమర్శలు చేస్తూ ఉంటాడు. ఆ కష్టానికి ఇప్పుడు ప్రతిఫలంత దక్కింది.
అయితే సోమిరెడ్డికి ఇప్పుడు పదవి దక్కడం వెనుక ఉన్నది కేవలం ఆ కష్టం మాత్రమే కాదని పొలిటికల్ సర్కిల్స్ లో వాదన వినిపిస్తోంది. జగన్ ను తిట్టడంతో కాదు.. బాబును పొగడటం ద్వారానే సోమిరెడ్డికి పదవి లభించిందని టాక్. బాబును పొగడటం అంటే.. అలా ఇలా కాదు.. ఒక రేంజ్ లో ఆయనను పొగిడాడు సోమిరెడ్డి. బాబు నాయతకత్వంలో పనిచేయడం తమ అధృష్టం అని.. బాబు నాయకత్వంలోనే కాదు.. చిన్నబాబు లోకేష్ నాయకత్వంలో పనిచేయడానికి కూడా తాము సదాసిద్దమని సోమిరెడ్డి చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగక.. లోకేష్ బాబుకు ఇటీవల పుట్టిన తనయుడి నాయకత్వంలో పనిచేయడానికి కూడా తాము సంసిద్ధమని ఇటీవల సోమిరెడ్డి వ్యాఖ్యానించాడు. ఇంతలా చంద్రబాబుపై భక్తిని చాటుకొన్నాడు ఈ రెడ్డిగారు. దీంతో బాబు కూడా కరుణించి.. ఆయనకు పదవిని ప్రదానం చేసినట్టు టాక్. మొత్తానికి మనవడిసెంటిమెంటుకు బాబు పడిపోయాడనమాట!