వైకాపా నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇప్పటికి జోరుగా హల్ చల్ చేస్తున్నాయి. తాను బీకాం చదివాను అని.. బీకాంలో ఫిజిక్స్ మరియు మ్యాథ్స్ ఉంటుందని.. అవి తాను చదివాను అంటూ.. జలీల్ ఖాన్ వ్యాఖ్యలు ఎంత కామెడీని పంచాయో అందరికి తెలిసిందే.
అయితే తాజాగా అసెంబ్లీలో కూడా బీకాం ఫిజిక్స్ వ్యవహారం చర్చకు వచ్చింది. తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే జగన్, జలీల్ ఖాన్ల మద్య ఈ విషయం వచ్చింది. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంకు ధన్యవాదాలు చెప్పే చర్చ జరుగుతుంది.
ఆ టైంలో జగన్ మాట్లాడుతూ చేపల పెంపకంకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు సరిగ్గా లేవంటూ మాట్లాడుతున్న టైంలో జలీల్ ఖాన్ లేచి ఏదో మాట్లాడబోయాడు. దాంతో జగన్ స్పందిస్తూ బీకాంలో ఫిజిక్స్ చదువుకున్న వారికి ఇవేం అర్ధం కావు అనడంతో వైకాపా సభ్యులు అంతా నవ్వారు. అదే టైంలో మంత్రి యనమల స్పందిస్తూ.. కాలేజీలు ఎగ్గొట్టి, దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకున్న వారికి ఆ లెక్కలు అర్థం అవ్వవు అంటూ జగన్ను ఉద్దేశించి అన్నాడు.
{youtube}pP4CpS7N2NQ{/youtube}