కృష్ణా జిల్లాలో మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టింది. విజయవాడలో పోలింగ్ ప్రక్రియను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తు న్నారు. సీవీఆర్ స్కూల్ ఆవరణలోని 4వ పోలింగ్ కేంద్రం లో ఓటింగ్ సరళిని ఎన్నికల కమిషనర్ పరిశీలించారు. అక్కడే ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్తో కలిసి పరిశీలించారు.
ఈ రోజు సాయంత్రం వరకు విజయవాడ నగరంలో పలు పోలింగ్ కేంద్రాలను ఎస్ఈసీ ఆకస్మిక తనిఖీ చేయనున్నారు.ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేశాం. ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా పరిస్థితులు కల్పించాం. రాజ్యాంగ బద్ధ హక్కును వినియోగించుకోవాలి అని అన్నారు.
విజయవాడలో మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ పటమటలోని కొమ్మ సీతారామయ్య జెడ్పీ బాలికల హైస్కూలో ఓటు వేశారు.
ఆయనతోపాటు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు. పవన్ వచ్చేసరికి పోలింగ్ కేంద్రం రద్దీగా ఉండటంతో … ఆయన్ను ప్రత్యేకంగా లోనికి పంపేలా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.
‘ఆదిపురుష్’ లేటేస్ట్ అప్ డేట్!