Friday, April 26, 2024
- Advertisement -

‘ఆదిపురుష్’ లేటేస్ట్ అప్ డేట్!

- Advertisement -

బాలీవుడ్ లో ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘ఆదిపురుష్’ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలోనే నిర్మాణం జరుపుకుంటున్నాయి. ప్రభాస్ మొదటి సారిగా స్టెయిట్ గా బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారు. రామాయణం ఆధారంగా సోషియో ఫాంటసీ చిత్రంగా దీనిని రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తుండగా.. లంకేశ్ గా విలన్ పాత్రలో హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో మరికొంత మంది బాలీవుడ్ స్టార్లు నటిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆదిపురుష్ లో లక్ష్మణుడిగా బాలీవుడ్ నటుడు, ‘ఉరి: ది సర్జికల్ స్ట్రయిక్’ ఫేమ్ విక్కీ కౌశల్ ను ఎంపిక చేసినట్టు తాజా సమాచారం.

ఇక రాముడి తల్లి కౌసల్యగా హేమమాలిని, సీతగా కృతి సనన్ నటించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం షూటింగుకి ముంబై స్టూడియోలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ కు అధిక ప్రాధాన్యత ఉండడంతో ఇందుకోసం అంతర్జాతీయ నిపుణులు పనిచేస్తున్నట్టు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -