ఇప్పటికి ఆడపిల్లలంటె సమాజంలో చిన్న చూపే. తల్లి గర్భంలో నలుసుగా పడింది మొదలు మన దేశంలో ఆడబిడ్డ ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ రోజుల్లో కూడా బ్రూణ హత్య దశను దాటి భూమిఫై పడింది మొదలు ఆడపిల్ల అడుగడుగునా విచక్షణ ఎదుర్కొంటున్న తీరు అత్యంత బాధాకరం. దీనికి కారణం సమాజ మూలమూలల్లో స్థిరపడ్డ పురుషస్వామ్య సంస్కృతి ఒక కారణం అయితే, అడవారికే ఆడవాళ్లే శత్రువులు అన్న రీతిలో ఇతర ఆడవాళ్లు కొంత వరకు కారణం అవుతున్నారు.
ప్రస్తుతం అమ్మాయిలు అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోరు. ఉద్యోగం, సంపాదన, తెలివితేటలు వీటన్నింటిలో ముందంజలోఉన్నారు. అన్ని రంగాల్లో వాల్లె ముందున్నారు. అయినా వివక్ష కొనసాగుతోంది. ఎంతో మంది చదువును మధ్యలోనె ఆపేస్తున్నారు. దానికి కారనం కుటుంబ ఆర్థిక పరిస్థితులు. కాని అలాంటి ఆర్థిక పరిస్థితుల కుటుంబంనుంచి ముగ్గురు అమ్మాయిలు సివిల్ ర్యాంక్ సంపాదించి కలెక్టర్లుగా సెలక్ట్ అయ్యారు.
వివిరాల్లోకి వెల్తే రాజస్థాన్ రాష్ట్రం నుండి సివిల్స్ సర్వీసెస్ కు ఒకే కుటుంబానికి చెందిన 3గ్గురూ చెల్లెల్లు కమల, గీత, మమత(కలెక్టర్ లుగా) లకు 32 ,64, 128ర్యాంకులు సాధించారు. వీరి కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తే తండ్రి చనిపోయాడు, తల్లి దినసరి కూలీ మరియు రజక కులవృత్తి చేస్తూ ఒక తల్లి గా వారిని పోషించడమే అసాధ్యం . ఆతల్లి పడిన కష్టానికి,వంశగైరవాన్ని నిలిపిన ముగ్గురు కుమార్తెలు నిజంగా సరస్వతులే.
కలెక్టర్ అవ్వాలంటె చిన్న విషయం కాదు. ఎన్నో అవకాశాలు, ఆర్థిక వనరులు, కుటుంబ ఇబ్బందులు లేకున్నా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నా, రాజకీయం గా ఉన్న ఇలాంటి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే సాధ్యం. వీటన్నింటిని అధిగమించి అమ్మాయిలు తలుకుకుంటె ఏదీ సాధ్యం కాదు అని ఈముగ్గురు అక్కాచెల్లెల్లు నిరూపించారు. భారత పౌరులకు స్పూర్తి దాయకం. వెయ్యి ఏనుగుల బలం,వారి ధృఢ సంకల్పం, ఆత్మ విశ్వాసం చూస్తే మనం నమ్మలేని నిజాలు గా ఉన్నాయి.
ఒకే కుటుంబం లో ఒక్క రికీ సివిల్ సర్వీసెస్ (IASలుగా సెలెక్టు) రావడమే మహాగొప్ప గొప్ప . అలాంటిది ఒకే కుంటుంబంలో ముగ్గురు సివిల్ ర్యాంకులు సాధించారంటె చిన్నవిషయం కాదు. IAS, IPS ఉద్యోగాలు సాధించాలనె వారికి ఈ ముగ్గురు అక్కాచెల్లెల్లు స్పూర్తి.