ఏపీలో కూటమిగా టీడీపీ -జనసేన- బీజేపీ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్గా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్న ఈ కార్యక్రమానికి బీజేపీ దూరంగా ఉండటం, అలాగా పొత్తు నాయకుల మధ్యే ఉండగా కింది స్థాయి కేడర్ మాత్రం కలవలేకపోతున్నారు.
ముఖ్యంగా జనసేన లీడర్లకు అడుడగుడునా టీడీపీ నేతల నుండి అవమానాలే ఎదురవుతున్నాయి. ఇటీవలే దెందులూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ జనసేన నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రచారానికి రావాల్సిన అవసరం లేదని హుకుం జారీ చేశారు చింతమనేని.
ఈ సంఘటన మర్చిపోకముందే మరో పరాభం జరిగింది. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ నేతలను ప్రచారం రథంపై నుండి బలవంతంగా గెంటేశారు టీడీపీ నేతలు. జనసేన నాయకుల గల్లా పట్టి మరి కిందకు లాగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
జనసేన జెండాలు లేకుండా ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించడమే వారి పాపమైంది. గల్లా పట్టి ప్రచార రథం ఎక్కిన వారిని దించేశారు టీడీపీ నేతలు. ఇక టీడీపీ నేతల తీరుపై జనసైనికులు భగ్గుమంటున్నారు. తమను అవమానించిన టీడీపీకి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఇక టీడీపీ తరపున గంటా శ్రీనివాసారావు పోటీ చేస్తుండగా వైసీపీ తరపున అవంతి శ్రీనివాసరావు బరిలో ఉన్నారు.