- Advertisement -
లైగర్ ఫ్లాప్ తర్వాత పూరి జగన్నాథ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం డబుల్ ఇస్మార్ట్. చాలా కాలం తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు పూరి. ఉస్తాద్ రామ్ పోతినేని పూరీ కనెక్ట్ బ్యానర్పై తెరకెక్కుతుండగా లెన్తీ షెడ్యూల్ ముంబైలో ప్రారంభమైంది.
ఇస్మార్ట్ శంకర్ కు మెలోడీ బ్రహ్మ మణి శర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీని శామ్ కె నాయుడు, జియాని జియానెలీ హ్యాండిల్ చేస్తున్నారు.టెక్నికల్ గా హై స్టాండర్డ్స్తో హై బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. త్వరలోనే హ్యుజ్ ప్రమోషనల్ క్యాంపెయిన్ ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.