- Advertisement -
ఐపీఎల్ చరిత్రంలో ఐదోసారి భారీ టార్గెట్ని చేధించింది పంజాబ్. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ ఘన విజయం సాధించింది.200 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. శశాంక్ సింగ్ అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. 29 బంతుల్లో 4 సిక్స్లు,6 ఫోర్లతో 61 నాటౌట్గా నిలవగా ప్రభ్సిమ్రన్ సింగ్ 24 బంతుల్లో 35, అశుతోష్ శర్మ 17 బంతుల్లో 31 రాణించడంతో పంజాబ్ విజయం సాధించింది. శశాంక్ సింగ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ 89,సాయి సుదర్శన్ 19 బంతుల్లో 33 పరుగులు చేయడంతో గుజరాత్ భారీ స్కోర్ సాధించింది. గుజరాత్కు నాలుగు మ్యాచ్లలో ఇది రెండో పరాభవం కాగా పంజాబ్కు రెండో విజయం.