భారత మాజీ కెప్టెన్ ఎం ఎస్ ధోనీ ప్యూచర్పై టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి క్లారిటీ ఇచ్చారు. గత ఏడాది వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకి పూర్తిగా ధోనీ దూరమైయ్యాడు. రిటైర్మెంట్పై గురించి స్పందించలేదు. ఇంలోవైపు రీ ఎంట్రీ పై కూడా క్లారిటీ ఇవ్వలేదు. వరుసగా రిషబ్ పంత్కి వన్డే, టీ20ల్లో వికెట్ కీపర్గా అవకాశాలిస్తున్నారు భారత సెలక్టర్లు.
దాంతో ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై జరిగే టీ20 వరల్డ్కప్ ధోనీ ఆడటంపై అనుమానాలు వినిపిస్తున్నాయి. ధోనీ రీఎంట్రీ, రిటైర్మెంట్పై వస్తున్న రూమర్స్ గురించి తాజాగా రవిశాస్త్రి స్పందించాడు. ‘ధోనీతో పర్సనల్గా నేను మాట్లాడాను. ఆ విషయాన్ని నేను ఇప్పుడు బహిర్గతం చేయలేను. కానీ.. ఇప్పటికే ధోనీ టెస్టు కెరీర్ని ముగించాడు. వన్డేల నుంచి కూడా త్వరలోనే అతను తప్పుకోనున్నాడు.
ఇక మిగిలింది టీ20లు మాత్రమే. కాబట్టి.. అతను ఐపీఎల్ 2020 సీజన్లో తప్పకుండా ఆడతాడు. ధోనీ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నా.. జట్టుకి అతను ఎప్పుడూ భారంగా మారడు. ఒకవేళ ఐపీఎల్లో అతను మెరుగ్గా రాణించగలిగితే..? టీమ్లోకి రీఎంట్రీ ఇచ్చినట్లే. టీమిండియా మేనేజ్మెంట్ అనుభవం, ఫామ్లో ఉన్న ఆటగాడిని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుంది’ వెల్లడించాడు.