వైకాపా అధినేత వైఎస్.జగన్ టాలీవుడ్ టాప్ హీరో యంగ్టైగర్ ఎన్టీఆర్కు సాయం చేశారు. వైఎస్.జగన్ ఎన్టీఆర్కు ఎందుకు సాయం చేయాల్సి వచ్చింది అని అనుకుంటున్నారా? అయితే అసలు విషయంలోకి వెళ్లాలి.. ఎన్టీఆర్కు వైఎస్.జగన్ డైరెక్ట్ సాయం చేయకపోయినా ఇన్డైరెక్టుగా సాయం చేశారు. ప్రత్యేక హోదా కోసం శనివారం ఏపీలో వైకాపా ఆధ్వర్యంలో భారీ ఎత్తున బంద్ జరిగింది.
బంద్ కావడంతో.. ఆఫీస్లు, స్కూళ్లు, బ్యాంకులకు సెలవు ప్రకటించారు. అన్ని ప్రాంతాల్లోనూ సాయంత్రంలోపు బంద్ ప్రభావం తగ్గిపోయింది. దీంతో సాధారణ జనజీవనం యథాతథ స్థితికి వచ్చింది. ఆఫీస్లు, స్కూళ్లకు విరామం లభించడంతో ప్యామిలీలు అందరూ తమ తమ పిల్లలను వెంటబెట్టుకుని సినిమాలు, షికార్లకు వెళ్ళారు. అయితే ప్రస్తుతం ఉన్నా సినిమాలో పెద్ద సినిమా జనతా గ్యారేజ్.
ఎలాగో ఈ చిత్రంకు హిట్ టాక్ రావడంతో శనివారం మిగిలిన సాధారణ రోజుల్లో కన్నా బాగా వసూళ్లు వచ్చాయట. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో శనివారం వసూళ్లు ఎక్కువగా వచ్చాయి. సో వైఎస్.జగన్ డైరెక్ట్ సాయం చేయకపోయినా ఇన్డైరెక్టుగా సాయం చేశారు. ఇది అసలు సంగతి. మొత్తానికి జనతా గ్యారేజ్కు జగన్ వల్ల మంచి లాభాలే వచ్చాయి.
Related