‘జనతా గ్యారేజ్’ చిత్రం ఘన విజయం సందర్బంగా నిన్న టీమ్ థ్యాంక్స్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ మీట్ లో దర్శకుడు సహా అందరూ ఓ మాదిరిగా మాట్లాడితే హీరో తారక్ మాత్రం చాలా భావోద్వేగంగా మాట్లాడాడు. ఈ చిత్ర విజయం ఆయనకు ఎంత కీలకమైందో అయన మాటల్లోనే అర్థమైపోయింది. ‘గత 12 ఏళ్లుగా ఈ విజయం కోసం ఎదురుచూస్తున్నాను.
ఇంతటి హిట్ ఇచ్చిన కొరటాల శివకు నా థ్యాంక్స్. నన్ను ఇంతలా ఆదరించిన మోహన్ లాల్ గారికి నా కృతఙ్ఞతలు’ అన్నారు.అలాగే ‘నేను సమంత ఇప్పటికి నాలుగు సినిమాలు చేశాం. అందులో రెండు పెద్దగా ఆడలేదు. దీంతో మేమిద్దరం కలిసి సినిమా చేస్తే ఖచ్చితంగా పోతుందని రూమర్ కూడా వచ్చింది. కానీ చివరికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది’ అన్నారు.
ఇకపోతే సినిమా విజయంలో సహాయపడ్డ దేవిశ్రీ, ఇతర నటీనటులు, ఎడిటర్ చంటి అందరికీ ఎన్టీఆర్ థ్యాంక్స్ చెప్పారు. ఇంట భావోద్వేగమైన తారక్ స్పీచ్ విన్నాక ఆడిటోరియం చప్పట్ల మోత మోగిపోయింది.
Related