పవన్ కళ్యాణ్ ఫాన్ ఒకరు చనిపోయిన విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఆ వ్యక్తి ని చంపేసింది ఎన్టీఆర్ ఫాన్ అంటున్నారు. ఈ నేపధ్యం లో పవన్ కళ్యాణ్ స్వయంగా తిరుపతి వెళ్లి ఆ కుర్రాడి తల్లితండ్రులనీ , ఫ్రెండ్స్ నీ కలిసి ఒస్తున్న తరుణం లో ఇప్పుడు ఎన్టీఆర్ మీద మీడియా ఫోకస్ పెట్టింది. పవన్ స్పందించినా కూడా ఎన్టీఆర్ ఏమీ మాట్లాడకపోవడం బాలేదు అంటున్నారు అందరూ.
హద్దులు దాటిన అభిమానంతో హత్యకు సైతం వెనుకాడని వ్యక్తిని అభిమానిగా చెప్పటాన్ని తారక్ ఖండించాలి. ఇలాంటి పనులు చేసే వారు తనకెప్పటికి అభిమానులుగా ఉండలేరన్న విషయాన్ని స్పష్టం చేయాలి. కానీ.. ఇప్పటివరకూ తారక్ ఈ ఉదంతంపై స్పందించకపోవటాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు.
విషయం ఏదైనా.. లోగుట్టు ఇంకెలా ఉన్నా.. ఎన్ని గొడవలు ఉన్నా.. చంపుకునే వరకూ విషయం వెళ్లకూడదు. అలాంటి వైఖరి ఏ మాత్రం సరికాదని చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ.. తారక్ మాత్రం ఈ ఇష్యూ మీద ఇప్పటివరకూ ఎందుకు స్పందించలేదన్నది ప్రశ్నగా మారింది.
Related