రాష్ట్రాలలో అధికారం ఉన్న పార్టీలు తమ రాష్ట్ర అభివృద్దికి అవసరమైన సహాయాన్ని కేంద్రంతో కొట్లాడయినా తెలచ్చకుంటాయి. ఇది సర్వ సాధారనం. కేంద్రంలో సొంత పార్టీ అధికారంలో లేకపోయినా సరే అవసరమైనన్ని నిధులకోసం కనీసం పోరాటమన్న చేస్తాయి. కానీ ఏపీలో మాత్రం అందకు విరుద్దం. ఇక్కడ అధికార పార్టీ చేయాల్సిన పనులను ప్రతిపక్ష వైసీపీ పార్టీ చేస్తుండటం గమనర్హం. అంటే ఇక్కడ టీడీపీ నిర్వహించాల్సిన భాద్యత ప్రతిపక్ష పార్టీ నిర్వహిస్తోంది.
ఏపీలో టీడీపీ కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ది చెందుతుందని చెప్పినట్లుగా నే అటు కేంద్రంలో బీజేపీ.. ఇటు రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ ఉమ్మడిగా అధికారన్ని చేపట్టాయి. ఇంకేముందు ఏపీ అభివృద్దిలో దూసుకుపోతుందని అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. రాష్ట్రంలో బీజేపీతో అధికారాన్ని పంచుకున్న టీడీపీ రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన ప్రత్యేక రైల్వేజో్న్, ప్రత్యేకహోదా, నిధుల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు నోరు మెదపడంలేదన్నసంగతి తెలిస్తే. స్వప్రయేజనాల కోసం ఇవన్నీ కేంద్రం దగ్గర తాకట్టు పెట్టారనడంలో సందేహంలేదు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా ఎంపీ బుట్టారేణుక మాత్రం తన నియేజక వర్గ సరిధిలోని రోడ్లను జాతీయ రహదారులుగా చేయాలనీ రెండు సంవత్సరాలుగా చేస్తున్న కృషి పలించింది. చివరకు కేంద్ర ఉపరితల రావాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు.
ప్రతి పక్షపార్టీకి చెందిన ఎంపీగా రాష్ట్ర వభివృద్దికి కేంద్ర సర్కారును అడుగుతుంటే…. ఇటు రాస్ట్రంలో… అటు కేంద్రంలోనూ భాగస్వామిగా ఉన్న టీడీపీ మాత్రం కనీసం ఎంపీ చేస్తున్న ప్రయత్నానికి సహకరించలేదు. గత రెండే సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఎంపీ బుట్టారేణుకకు కేంద్రం తీపికబురును అందించింది. కర్నూలు గుండా వెల్తున్న మూడు రహదారులను జాతీయ రహదారులుగా స్తాయిని పెంచుతూ రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీచేసిందని వైసీపీ కార్యాలయం ఓప్రకటనలో తెలిపింది. ఇది ప్రతిపక్ష పార్టీ సాధించిన విజయం.
ఎంపీ నియేజక వర్గంగుండా వెల్లే రోడ్లును చూసుకుంటే ఏపీ,కర్నాటక రాష్ట్రాలను కలిపే గుత్తితో అనుసంధానమై ఉన్న పత్తికొండ,ఆదోని,మదిరే,హనవల్,కౌతాళం, హాల్వీ, మాన్వి ప్రాంతాలు కలిపే రోడ్డు (ఏపీలో 135 కి.మీ. కర్నాటకలో15 కి.మీ) జాతీయ రహదారిగా అప్గ్రేడ్ అయ్యింది. అంతే కాకుండా కొత్తకోట,గూడూరు, మంత్రాలయంను కలిపే 167 వ జాతీయ రహదారిగా ( ఏపీలో 22 కి.మీ..తెలంగాణాలో 70 కి.మీ) మార్చారు. ఇక మూడవది ఏపీలోని ఆంజనేయ దేవాలయం వద్ద క్రాస్ అయ్యే 167 వ జాతీయ రహదారినుంచి కర్నాటకలోని బల్లారితో (ఏపీలో 2మి.మీ. కర్నాటకలో 26 కి.మీ.) అనుసంధానం చేసినట్లు కేంద్ర సర్కార్ ప్రకటించింది. ఇది ఏపీలో ప్రతిపక్షం సాధించిన విజయం.
Related