- Advertisement -
తమిళనాడు అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని నొక్కిచెప్పారు బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. రాష్ట్ర అభివృద్ధి కోసం 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.5.42 లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు రాష్ట్రానికి నిధులు కేటాయించటంలో అలసత్వం ప్రదర్శించాయని విమర్శలు చేశారు.
తమిళనాడు పర్యటనలో భాగంగా పొంగల్ ఉత్సవాల్లో పాల్గొన్నారు నడ్డా. తమిళనాడులో అమలవుతోన్న కేంద్ర పథకాల ప్రయోజనాలను వివరించారు.తమిళనాడులోని టెక్స్టైల్స్, దాని పరిశ్రమల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1,600 కోట్లు కేటాయింటినట్లు గుర్తు చేశారు నడ్డా. వోకల్ ఫర్ లోకల్ నినాదంతో ఆత్మనిర్భర్ భారత్ దిశగా సాగుతున్నట్లు చెప్పారు.