నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం అవుతోంది. బాలకృష్ణ వందో సినిమా శాతకర్ణితోనే ఎంట్రీ ఇస్తాడని అందరూ అనుకున్నారు. అయితే ఈ చిత్రంలో మోక్షు నటించలేదు. ఇక లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ ఏడాది మోక్షజ్ఞ డెబ్యూ మూవీ పట్టాలెక్కుతుందని బాలకృష్ణ సన్నిహిత వర్గాల వారు అంటున్నారు. ఇదే విషయంపై బాలకృష్ణ కూడా ఒకటి రెండుసార్లు మాట్లాడిన విషయం తెలిసిందే. చారిత్రక కథ ద్వారానే మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ ఉంటుందని బాలయ్య కన్ఫార్మ్ చేశారు.
బాలకృష్ణ ఈ విషయం చెప్పగానే వెంటనే ఆ చారిత్రక కథ ఏమై ఉంటుంది..? దీనిపై ఇప్పుడు ఫిల్మ్నగర్లో ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ద్వారా బాలయ్య ఘన విజయంను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆ శాతకర్ణి కుమారుడు పులోమావి స్టోరీనే సినిమాగా తీయాలని బాలయ్య అనుకుంటున్నాడు. శాతకర్ణి సినిమా అంతా.. యుద్ధ నేపథ్యంలో సాగుతుంది కాబట్టి మోక్షజ్ఞ సినిమాను ప్రేమకథా నేపథ్యంలో తీస్తారని చెబుతున్నారు.
పులోమావి శ్రావణి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. దానిపైనే చారిత్రక అంశాల ఆధారంగా సినిమాగా మలుస్తారని అంటున్నారు. పులోమావి – శ్రావణి ప్రేమకథ ఆధారంగా ప్రముఖ రచయిత ముదిగొండ శివప్రసాద్ రచించిన ‘శ్రావణి’ నవలను ఆధారంగా చేసుకుని సినిమా తీస్తారని ఫిల్మ్నగర్ వర్గాల టాక్. ఈ చిత్రంకు కూడా శ్రావణి అనే టైటిలే పెడతారని.. ఈ చిత్రంకు కూడా క్రిష్ దర్శకత్వం వహిస్తారని వార్తలు వస్తున్నాయి.
Related