- Advertisement -
సినిమా టికెట్ ధరలు పంచుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. కొత్త జీవో జారీ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
”తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగే విధంగా.. అటు థియేటర్ల మనుగడను.. ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా టికేట్స్ రేట్స్ సవరిస్తూ సరికొత్త జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారికి. పరిశ్రమ తరపున కృతజ్ఞతలు.
చిన్న సినిమాకు ఐదవ షో అవకాశం కల్పించడం ఎందరో నిర్మాతలకు ఉపయోగపడే అంశం. సంబంధిత మంత్రివర్యులు.. పేర్ని నాని గారికి, అధికారులకు, కమిటీకి ధన్యవాదాలు” అంటూ చిరంజీవి ట్వీట్ లో పేర్కొన్నారు.