- Advertisement -
వైనాట్ 175 లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు సీఎం జగన్. ఇందులో భాగంగా ఇప్పటికే పెద్ద ఎత్తున అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల అభ్యర్థులను మారుస్తున్నారు జగన్. ఈ నేపథ్యంలో కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి కూడా పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే దీనిని ఆదిలోనే ఖండించారు మహీధర్ రెడ్డి. అవసరమైతే రాజకీయాల నుండి తప్పుకుని ప్రశాంత జీవితం గడుపుతా కానీ టీడపీలో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.నియోజకవర్గ అభివృద్ధి విషయంలో జగన్ నిర్ణయమే ఫైనల్ అని వెల్లడించారు.
వైసీపీ అధిష్ఠానంతో తనకు ఎలాంటి విభేదాలు లేవని …. బీసీలకు టికెట్ ఇస్తే ఎలాంటి అభ్యంతరం లేదని.. పూర్తిగా సహకరిస్తానని అన్నారు. కందుకూరు ఎమ్మెల్యే సీటును బీసీ నేత రామారావు యాదవ్కు ఖరారు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే కందుకూరు సీటుపై జగన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.