ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ను 3-1 తేడాతో ఇప్పటికే టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక చివరిదైన ఐదో టుస్టు ఈ నెల 7 నుండి ప్రారంభం కానుండగా ఈ మ్యాచ్లోనూ గెలిచి సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతోంది రోహిత్ సేన. మరోవైపు ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో విజయం సాధించి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.
ఇక చివరి టెస్టులో రోహిత్కు రెస్ట్ ఇస్తారని ప్రచారం జరిగిన అందులో నిజం లేదని తెలుస్తోంది. రోహిత్ సారథ్యంలోనే టీమిండియా బరిలో దిగనుంది. నాలుగో టెస్టు మ్యాచ్లో ఆడిన ఆటగాళ్లతోనే ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దించింది బీసీసీఐ.
ఐదో టెస్టు మ్యాచ్ అశ్విన్ కు వందో టెస్టు మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్లోనూ అశ్విన్ మేజిక్ చేస్తాడో లేదో వేచిచూడాలి. ముఖ్యంగా యువ ఆటగాళ్లు జైస్వాల్, జూరెల్, సర్ఫరాజ్ అద్బుతంగా రాణిస్తున్నారు.
టీమిండియా జట్టు: రోహిత్ శర్మ ( కెప్టెన్ ), జైస్వాల్, గిల్, పాటీదార్, సర్ఫరాజ్, ధృవ్ జూరెల్, భరత్, పడిక్కల్, జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్, బుమ్రా, ముఖేష్, ఆకాష్ దీప్