- Advertisement -
ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత స్పిన్ ధాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. ముఖ్యంగా అశ్విన్, కుల్దీప్ స్పీన్ ముందు ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ కొలుకోలేకపోయింది. దీంతో 218 పరుగులకే ఆలౌట్ ఇంగ్లాండ్ అయింది . ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లోని వికెట్లన్ని స్పిన్నర్లే తీయడం విశేషం. కుల్దీప్ 5, అశ్విన్ 4, జడేజా ఒక వికెట్ తీశారు.
ఇక ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లలో క్రావ్లీ ఒక్కడే హాఫ్ సెంచరీ 79 పరుగులు చేయగా డకెట్ 27,పోప్ 11,రూట్ 26,బెయిర్ స్టో 29,స్టోక్స్ 0,ఫోక్స్ 24 పరుగులు మాత్రమే చేశారు. భారత పేసర్లు ఒక్క వికెట్ కూడా తీయకపోవడం విశేషం.
ఇప్పటికే ఇంగ్లాండ్తో సిరీస్ను 3-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో పటిదార్ను తప్పించి దేవదత్ పడిక్కల్కు చోటు దక్కింది.