Sunday, April 28, 2024
- Advertisement -

టీమిండియా 477 ఆలౌట్..259 రన్స్ లీడ్

- Advertisement -

ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత్ 477 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగుల లీడ్ సాధించింది. ఓవర్ నైట్ స్కోరుకు మరో నాలుగు పరుగులు మాత్రమే జోడించి మిగితా రెండు వికెట్లు కొల్పోయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బషీర్ 5,అండర్సన్,హార్ట్‌లీ తలో రెండు వికెట్లు తీయగా స్టోక్స్ ఒక వికెట్ తీశారు.

ఇక రెండో రోజు టీమిండియా బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయారు. ముఖ్యంగా గిల్, రోహిత్ బౌండరీలు, సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. రోహిత్ (103), గిల్ (110) సెంచరీలతో చెలరేగగా సర్ఫరాజ్, దేవదాస్ పడిక్కల్ సైతం హాఫ్ సెంచరీలతో రాణించారు. గడంతో భారీ స్కోరు సాధించింది. .

సర్ఫరాజ్ ఖాన్ (56) ,పడిక్కల్ (65) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగుల వద్ద ఆలౌటైంది. కుల్దిప్ (5/72), అశ్విన్ (4/51) వికెట్లు తీసి ఇంగ్లాండ్ నడ్డి విరిచారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -