ధర్మశాల టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. రెండో రోజు లంచ్ విరామ సమయానికి ఒక వికెట్ నష్టానికి 264 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ సెంచరీల మోత మోగించారు. రోహిత్ 160 బంతుల్లో 3 సిక్స్లు, 13 ఫోర్లతో 102 పరుగులు చేయగా గిల్ 142 బంతుల్లో 5 సిక్స్లు,10 పోర్లతో 101 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. ఇదే దూకుడుతో ఆడితే టీమిండియా భారీ స్కోరు సాధించడం ఖాయం.
శుభ్మన్ గిల్ కు ఇది నాలుగో సెంచరీ కాగా రోహిత్ శర్మకు 12వ సెంచరీ. ఇక ధర్మశాల టెస్టులో యశస్వి జైస్వాల్ రికార్డు సృష్టించాడు. తొలిరోజు యశస్వి పరుగుల వరద పారించాడు. యశస్వి టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేసుకోగా జైస్వాల్ కేవలం తొమ్మిది టెస్టు మ్యాచుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు.
యశస్వి జైస్వాల్ … 9 టెస్టుల్లో వెయ్యి పరుగులు చేయగా పుజారా 11 టెస్టుల్లో,సునీల్ గవాస్కర్ 11 టెస్టుల్లో,వినోద్ కాంబ్లీ 12 టెస్టుల్లో ఈ ఘనత సాధించాడు.