Sunday, May 19, 2024
- Advertisement -

మూవీ రివ్యూలపై వరలక్ష్మీ..షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ వరలక్ష్మీ శరత్ కుమార్. క్యారెక్టర్ ఏదైనా ఆ పాత్రకు ప్రాణం పోయడం ఆమె ప్రత్యేకత. అలాగే లేడి ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్‌గా మారిన వరలక్ష్మీ ప్రస్తుతం శబరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సినిమా రివ్యూలు తాను అసలు చదవనని.. ఒకవేళ నా దగ్గర ఎవరైనా వాటి గురించి మాట్లాడినా కోపం వస్తుందని చెప్పుకొచ్చింది. అయినా అసలు రివ్యూలు రాసే వారికీ ఏం అర్హత ఉందని ..బాగున్నా సినిమాకి కూడా తమ వ్యూస్ కోసం కోసం నెగటివ్ రివ్యూలు రాసి ఇండస్ట్రీని నాశనం చేస్తున్నారని తెలిపింది.

సినిమా విడుదలైన ఐదు రోజులు అయినా రివ్యూలు ఇవ్వడం ఆపండి అంటూ చెప్పుకొచ్చింది. ఇక మదర్ సెంటిమెంట్‌తో వస్తున్న శబరి అందరిని ఆకట్టుకుంటుందని తెలిపారు వరలక్ష్మీ, అనిల్ కాట్జ్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని పాన్ ఇండియా లెవల్లో మే 3న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాట్లు చెప్పుకొచ్చింది. మరి దీనిపై రివ్యూవర్స్ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -