- Advertisement -

2029 ఎన్నికల్లో వైసీపీదే గెలుపు!

- Advertisement -

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలు ఆదివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను సందడిగా మార్చారు. జన్మదినోత్సవ సందర్భంగా జగన్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు స్వీకరించారు. అనంతరం పేద మహిళలకు చీరల పంపిణీ చేయడంతో పాటు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి సేవాభావాన్ని చాటారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి, 2029 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా జగన్ పాలన సాగిందని, అదే ప్రజల మద్దతుగా మారుతుందని అన్నారు.

నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 200కు పైగా స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని సజ్జల స్పష్టం చేశారు. ఒకవేళ 175 నియోజకవర్గాలే కొనసాగినా, గతంలో సాధించిన 151 సీట్లను మించి మరింత మెజారిటీతో గెలిచి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమ పథకాలు, నవరత్నాలు, గ్రామ స్థాయి అభివృద్ధి కార్యక్రమాలే వైసీపీ బలమని, ఇవే 2029లో పార్టీ విజయానికి బాటలు వేస్తాయని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -