హిందూపురం నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. చిలమత్తూరు మండలానికి చెందిన టీడీపీ నేత నాగేంద్రపై మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని అనుచిత ప్రవర్తనకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్కూల్కు వెళ్లే బాలికలను ట్రాప్ చేసి, అశ్లీల వీడియోలు చిత్రీకరించి బెదిరింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలికల నగ్న దృశ్యాలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నారని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్టు సమాచారం. ఈ వ్యవహారం బయటపడడంతో స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. హిందూపురం నియోజకవర్గం ప్రస్తుతం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కావడంతో ఈ ఘటన రాజకీయంగానూ చర్చనీయాంశమైంది.
అయితే ఆరోపణలపై అధికారికంగా పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. పోలీసులు ఫిర్యాదులు స్వీకరించి విచారణ ప్రారంభించినట్టు సమాచారం. నిజానిజాలు దర్యాప్తులో తేలనున్నాయి. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రామాణికత, వాటి నేపథ్యం గురించి కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఘటనపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
