- Advertisement -
సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా ప్రమోషన్ కార్యక్రమాల స్పీడు పెంచారు.ఇప్పటికే టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ ఆదివారం ఉదయం ఐ డోంట్ నో అంటూ సాగే మరో పాటను విడుదల చేశారు.ఈ పాటను బాలీవుడ్ స్టార్ ఫర్హాన్ అక్తర్ పాడగా,రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించారు.
ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్గా కైరా అద్వాని నటిస్తున్న సంగతి తెలిసందే. ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపిస్తున్నాడు.
