- Advertisement -
వైసీపీ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఈ రోజు అస్వస్థతకు లోనయ్యారు. ఉదయాన్నే ఛాతి పట్టేసినట్లు అనిపించడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన అనంతపురంలోని సవేరా ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యేకు ప్రాథమిక చికిత్స ప్రారంభించిన వైద్యులు అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్ కు తరలించారు. గత కొంత కాలంగా ఆనోరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.