నందమూరి తారక రామారావు జీవిత కథను ‘ఎన్టీఆర్’ అనే పేరుతో సినిమాగా తెరెకక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఎన్టీఆర్ తనయుడు హీరో బాలకృష్ణ ఈ సినిమాలో నటిస్తు , నిర్మిస్తున్నారు. క్రిష్ ఈ బయోపిక్ ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇప్పటికే విడుదలన సినిమా పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికి హరికృష్ణ మరణం తరువాత బాలకృష్ణ వారి కుటుంబానికి దగ్గరైయ్యారు.దీనిలో భాగంగానే తారక్ నటించిన అరవింద సమేత సక్సెస్ మీట్కు ముఖ్య అతిథిగా వచ్చారు బాలయ్య.దీంతో ఎన్టీఆర్ బయోపిక్లో తారక్ నటిస్తున్నారనే వార్తలు ఎక్కువైయ్యాయి. టైటిల్ పాత్రలో బాలయ్య నటిస్తుండగా.. హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించనున్నారు.
చంద్రబాబుగా రానా,దగ్గుబాటిగా భరత్,శ్రీదేవిగా రకుల్ నటిస్తున్నారు.బాలయ్య తనయుడు మోక్షజ్ఞ నటిస్తారనే వార్తలు వచ్చినా.. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. అలానే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. యంగ్ బాలయ్య పాత్రలో తారక్ కనిపిస్తాడని అన్నారు. కానీ ఇప్పటికే షూటింగ్ సగం పూర్తయింది కాబట్టి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చే అవకాశం ఉందని మరికొందరు అన్నారు. అయితే ఈ విషయాలకు సంబంధించి దర్శకుడు క్రిష్ నుండి క్లారిటీ వచ్చింది. అన్ని పాత్రలు ఇప్పటికే ఫుల్ అయ్యాయని తారక్ ని ఏ పాత్రకి తీసుకోవడం లేదని అన్నారు. అలానే వాయిస్ ఓవర్ ఇచ్చే ఛాన్స్ కూడా లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కి సంబంధించి తారక్ ని ఏ విషయంలోనూ సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చారు.దీంతో ఎన్టీఆర్లో తారక్ కనిపించడని స్పషం అయింది.