బాలీవుడ్ హాట్ పెయిర్ రణ్వీర్ సింగ్,దీపికా పదుకునేలు ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ గురించి ఎవరు ఎన్ని ప్రశ్నలు అడిగిన ఎప్పుడు స్పందించలేదు ఈ జంట.ఇక పెళ్లి తరువాత హానీమూన్కు వెళ్లకుండా ఎవరి సినిమాలలో వారు మునిగిపోయారు. రణ్వీర్ నటించిన సింబా విడుదల కావడం, సూపర్ అవ్వడంతో ,షూటింగ్లకు కాస్తా గ్యాప్ ఇచ్చి మరి హానీమూన్కు వెళ్లారు ఈ నూతన జంట. వారం రోజుల పాటు హానీమూన్కు వెళ్లిన ఈ జంట ,ఆదివారం అర్ధరాత్రి ముంబైకు చేరుకుంది.
అయితే ఈ జంట హానీమూన్కు ఎక్కడకు వెళ్లారనేది మాత్రం తెలియడం లేదు. వీరు ఎక్కడకి వెళ్లారో సోషల్ మీడియలో కూడా ఎలాంటి విశేషాలను, ఫొటోలను పంచుకోలేదు. శ్రీలంకలో వీరిద్దరూ తమ హానీమూన్ ట్రిప్ ను ఎంజాయ్ చేశారని కొందరు చెబుతున్నారు. వీరు ముంబై చేరుకున్న సమయంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
- ఏపీకి భారీ వర్షసూచన..అలర్ట్!
- పొగాకు రైతులకు మద్దతుగా రంగంలోకి జగన్…
- భారత్లో పెళ్లి..విదేశాల్లో విడాకులా?
- మున్సిపల్ ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- నందమూరి ఫ్యామిలీ నుండి మరో పొలిటికల్ ఎంట్రీ?
