వైఎస్ షర్మిలపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషియల్ మీడియాలో తనపై దుస్ప్రచారం చేస్తున్నారని హైరదాబాద్ సీపీకీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. షర్మిల తనకు కూతురుతో సమానమని…కులాంతర వివాహం చేసుకున్నందుకు వైఎస్ కుటుంబాన్ని గతంలోనే అభినందించానని ఆయన చెప్పారు. షర్మిళను విమర్శించి ఉంటే తనకు పాపం తగులుతుందని జేసీ చెప్పారు.
వైఎస్ కుటుంబం కులాలను రెచ్చగొట్టడంపైనే విమర్శించానని ఎంపీ జేసీ గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. అనంతపురం జిల్లాలో ఇటీవల జరిగిన ధర్మపోరాట దీక్షలో మాట్లాడుతూ.. నీ సోదరి షర్మిల ఓ బ్రాహ్మణుడిని పెళ్లి చేసుకోలేదా? అని జేసీ జగన్ ను అప్పట్లో ప్రశ్నించారు.
మరో వైపు కేసీఆర్, జగన్లు కలవడంపై కూడా స్పందించారు. కేసీఆర్, జగన్ ఇప్పుడు కలిసి పనిచేయడమేమిటి, ఏడాది నుంచి కలిసే పనిచేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తో కలిసి పది మంది ఎపికి వచ్చినా టీడీపీని చేయగలిగిందేమీ లేదని అన్నారు.