మాటల మాత్రింకుడు త్రివిక్రమ్ తన మాటలతో మాయ చేస్తుంటాడు. తన సినిమాలలోని డైలాగులు సినిమా చూసి ఇంటికి వెళ్లిన తరువాత కూడా మనల్ని వెంటాడుతు ఉంటాయి. అందుకే స్టార్ హీరోలు సైతం త్రివిక్రమ్తో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తారు.అలాంటి త్రివిక్రమ్ ఓ హీరోయిన్పై మోజు పడ్డారని వార్తలు వస్తున్నాయి. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు .. గీతా గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండతో పోటీ పడి మరి నటించిన హీరోయిన్ రష్మిక మందాన. త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్తో ఓ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో హీరోయిన్గా మొదట కియారా అద్వానీ అనుకున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికను తీసుకుందామని భావిస్తున్నాడట త్రివిక్రమ్. కాని బన్ని మాత్రం కియారానే కావాలని పట్టుబడుతున్నాడ. అయితే గీతా గోవిందంలో రష్మిక యాక్షన్ చూసిన దగ్గర నుంచి త్రివిక్రమ్ ఆమెతో ఒక్క సినిమా అయిన చేయలని ఆలోచనలో ఉన్నాడట. అందుకే రష్మికను బన్ని సినిమాలో హీరోయిన్గా తీసుకున్నాడట మాటల మాంత్రికుడు. ఈ వార్తే కనుక నిజం అయితే రష్మిక కెరీర్ దూసుకుపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
- తమిళనాడు రాజకీయాల్లో సంచలనం!
- మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ అక్రమాలు: జగన్
- నిర్మాతగా మారిన యాంకర్ ఉదయభాను!
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
