- Advertisement -
తెలుగు రాష్ట్రాలలో దుమారం రేపిన ఐటీ గ్రిడ్స్ డేటా చోరి కేసులో సిట్ మరో ముందడుగు వేసింది.కేసులో ప్రధాన నిందితుడైన ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్ కు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరో వైపు విచారణకు హజరు కవాల్సిందేనని హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ స్కామ్ వెలుగులోకి వచ్చినప్పటినుంచి ఐటీ గ్రిడ్ సీఈవో అశోఖ్ పరారీలో ఉన్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా అశోక్ విచారణకు హాజరుకాకపోవడం పట్ల సిట్ అధికారులు సీరియస్గా ఉన్నారు. 41సీఆర్సీసీ కింద అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఇప్పటి వరకు జరిగిన విచారణను కోర్టుకు పూర్తి స్థాయిలో ఈనెల 20 నివేదికను అందించనున్నారు.