వైఎస్ జగన్పై బాబు, లోకేష్ లు చేస్తున్న విమర్శలకు మొదటి నుంచి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. ఇంటా , యబటా సోషల్ మీడియా ద్వారా ఇద్దరికి నిద్రలేకుండా చేస్తున్నారు. ఇదలా ఉంటె విజయసాయిరెడ్డికి బెదిపింపు ఫోన్ కాల్స్ రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. 618729089, 9538362525, 8247662578, 8886059309 నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు సమాచారం.
టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యవహరించవద్దని హెచ్చరికలు జారీచేస్తూ కొద్ది రోజులుగా ఆగంతకులు తనకు పదే పదే కాల్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. మొదట వాటిని అంతగా పట్టించుకోనప్పటికీ తాను మీటింగుల్లో ఉన్న ప్రతీసారి ఫోన్లు చేస్తూ బెదిరింపులకు గురిచేశారని ఆయన తెలిపారు. టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు గాను పలువురు అధికార పార్టీ నేతలు తనను చంపుతామంటూ హెచ్చరించారని పేర్కొన్నారు.
బెదిరింపు ఫోన్ కాల్స్ నేపథ్యంలో హైకోర్టులో విజయసాయిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు సూచనల మేరకు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.