Tuesday, April 30, 2024
- Advertisement -

బాబు చేస్తే సంసారం.. జగన్ చేస్తే తప్పా.?

- Advertisement -

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. నవ్విన నాపచేనే పండుతోంది. అధికార అండతో చెలరేగిపోయిన పచ్చబ్యాచ్ కు ఇప్పుడు పాపం పడుతోందా.? అంటే ఔననే సమాధానం వస్తోంది. 2014లో చంద్రబాబు ఏపీ సీఎంగా గెలిచాక చెలరేగిపోయారు. వైసీపీ ఎమ్మెల్యేలను లాగేసి ప్రతిపక్ష వైసీపీ గొంతునొక్కే పనులు ఎన్నో చేశారు. ఇక టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న సాక్షి పత్రిక, సాక్షి టీవీని ముప్పుతిప్పలు పెట్టారు. చాలా ఏరియాల్లో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేశారు. ప్రభుత్వంలోని తప్పులు, అవినీతిని వెలికి తీస్తుందని ఈ పనికి చంద్రబాబు పాల్పడ్డారు.

అయితే నాడు బాబు చేసిన పనికి చంకలు గుద్దుకున్న పచ్చ బ్యాచ్, మీడియా ఇప్పుడు వైసీపీ చేసే సరికి గింజుకుంటోంది. నాడు చంద్రబాబు చేసింది సంసారమైతే నేడు జగన్ చేసేది కూడా అదే.. కానీ టీడీపీ మీడియా, నేతలు ట్రాయ్ కు ఫిర్యాదు చేస్తాం.. మీడియా గొంతునొక్కేశారంటూ మొసలికన్నీరు కారుస్తున్నారు..

ఏపీలో మూడు నెలలు అయినా తిరగకముందే వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి చంద్రబాబు, ఆయన మీడియా చేస్తున్న విష ప్రచారం అంతా ఇంతాకాదు.. దీంతో చాలా మంది ఎం.ఎస్.వోలే తాజాగా అసత్యవార్తలు ప్రసారం చేస్తున్నందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టీవీ5, ఏబీఎన్ చానెళ్లను నిషేధించినట్టు సమాచారం. రాష్ట్ర మొత్తం ఈ పనిచేసేందుకు రెడీ అవుతున్నారట..

అయితే దీనిపై టీడీపీ నేతలు, మీడియా గగ్గోలు పెడుతోంది. చంద్రబాబు ప్రభుత్వంలో సాక్షిని ఇలాగే నిషేధిస్తే నోరు ఎత్తని వీరంతా ఇప్పుడు ట్రాయ్ చట్టాలంటూ.. ఎక్కడ లేని నిబంధనలు తీసుకొచ్చి నానా యాగీ చేయడానికి రెడీ అయ్యారు. చంద్రబాబు చేస్తే సంసారం.. మిగతా వాళ్లు చేస్తే వ్యభిచారంలా పరిస్థితి తయారైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -