- Advertisement -
ఎడతెరపి లేని వర్షాలతో రెండు తెలుుగ రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. వర్షాలకు వంకలు, వాగులు పొర్లిపొర్లుతున్నాయి. వేసిన పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే వర్షాలతో అల్లాడుతుంటే ఇప్పుడు వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త అందించింది. తాజాగా రాష్ట్రాలకు హికా తుఫాను ముప్పు పొంచి ఉంది.
తుపాను ప్రభావంతో అరేబియా తీరంలో గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఉత్తరప్రదేశ్, విదర్భ, రాజస్థాన్, చత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో కుండపోత వాన కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.