- Advertisement -
అందాల తార, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్య రాయ్ అరుదైన అంతర్జాతీయ పురస్కారం అందుకున్నారు. గ్లోబెల్ ఇండియన్ అవార్డు అందుకున్న ఐశ్వర్య ఈ అవార్డును తన కుమార్తె ఆరాధ్యకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు.
అంతర్జాతీయ వేదికపై భారతీయ మహిళకు ఈ అవార్డు దక్కడం ఎంతో ఆనందంగా ఉంది అని అవార్డు ప్రదానోత్సవం అనంతరం ఐశ్వర్య చెప్పారు. అంతే కాదు.. ప్రపంచ సుందరిగా ఆనాడు పొందిన అవార్డు కంటే ఇది ఎంతో గొప్పదని ఐశ్వర్య అభిప్రాయపడ్డారు.
కెరీర్ ఉమెన్ గా, నటిగా తనను ఈ అవార్డుకు ఎంపిక చేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్న ఐశ్వర్య ఇది తాను సామాజికంగా.. నటిగా కూడా ఎదగడానికి దోహదపడుతుందని అన్నారు.