Sunday, May 19, 2024
- Advertisement -

అడల్ట్ సన్నివేశాలు వద్దు అంటున్న నాగ్

- Advertisement -

నాగార్జున హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘మన్మధుడు’ కి సీక్వెల్ గా ‘మన్మధుడు 2’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ కు ప్రేక్షకుల నుంచి నెగటివ్ రెస్పాన్స్ అందింది. ఈ నేపథ్యంలో తాజా సమాచారం ప్రకారం నాగార్జున ఈ సినిమాలోని అడల్ట్ సన్నివేశాలు అన్నీ తీసేసి ఈ సినిమాని క్లీన్ గా మార్చమని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అడల్ట్ కంటెంట్ వల్ల సినిమాకి బజ్ రాకూడదని, తన 30 ఏళ్ల కెరీర్లో ఇప్పటిదాకా నాగార్జున ఎప్పుడు క్లీన్ చిత్రాల్లో నటించానని ‘మన్మధుడు’ సీక్వెల్ సినిమాకి అలాంటి పేరు రాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు తన కోడలు అక్కినేని సమంత కంటెంట్ ఉన్న చిత్రాలు చేస్తుంటే, నాగార్జున తన సినిమాలకి అడల్ట్ ఇమగె రావడం ఇష్టంలేక ఇలా చేసుంటారని కొందరి అంచనా. ఈ నేపథ్యంలో రాహుల్ రవీంద్రన్ సినిమాలో బోల్డ్ డైలాగ్స్ అన్నీ తీసేసినట్టు తెలుస్తోంది. మరి సినిమా ఎలా ఇండబోతోందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -