Thursday, April 18, 2024
- Advertisement -

అన‌సూయ కాంట్ర‌వ‌ర్సీ ట్వీట్.. ఓ రేంజ్ లో ఆడుకున్న నెటిజ‌న్లు

- Advertisement -

ఒక‌ప‌క్క బుల్లి తెర‌పై స్టార్ యాంక‌ర్ గా రాణిస్తూ.. సినిమాల్లో వెరైటీ క్యారెక్ట‌ల‌తో దూసుకుపోతున్న అమ్మ‌డు అన‌సూయ‌. సోష‌ల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే యాంక‌ర్ అనుసూయ తాజాగా చేసిన కామెంట్స్ వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. దాంతో నెటిజ‌న్లు చేతిలో ట్రోలింగ్ కు గురైంది . అందంతో పాటు అభినయం కలిగిన అనసూయకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ మనసులో ఉన్న మాటని నిర్భయంగా చెప్పేస్తుంది.. ఎలాంటి జంకు లేకుండా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతుంటుంది. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంద‌ర్భంగా ఆమె వివాదాస్ప‌ద ట్వీట్ చేసింది. ” ఈ రోజు ఏంటి సడెన్ గా ట్రోలర్స్ & మీమ్స్ మేకర్స్ మహిళలను తెగ గౌరవిస్తున్నారు..? అయిన ఇది కేవలం 24 గంటలు మాత్రమే కదా.. ఆ తరువాత అంత మాములుగా మారిపోతుంది కదా! అందుకే మహిళలు వీటికి దూరంగా ఉండండి.. హ్యాపీ ఫూల్స్ డే” అంటూ ట్వీట్ చేసింది.

ఇంకేం ఉంది.. ఈ ట్వీట్ చేసిన కాసేపటికే వైరల్ అవ్వగా.. ట్రోలర్స్ అనసూయపై తెగ విరుచుకపడుతున్నారు. అందరు మొగాళ్లు మీరు ఆలోచించే విధంగా ఉండరు అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. నీ లాంటి ఆడవాళ్లు మమ్మల్ని మోసం చేశారు కాబట్టే ఇలా తయారయ్యాం అని మరి కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైన అనసూయ ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -