తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ అనుష్క చేరగని ముద్ర వేసుకుంది. కెరీర్ స్టార్టింగ్లో అందరిలాగానే మాములు సినిమాల్లో నటించింది. కాని అరంధతి సినిమాతో అనుష్కలోని నటన బయటికి వచ్చింది. ఈ సినిమా తరువాత తెలుగు ఇండస్ట్రీలో లేడి ఓరింటేడ్ సినిమాల్లో నటించాలి అంటే అనుష్క తరువాతే ఎవరైనా. బాహుబలి తరువాత చాలాకాలం గ్యాప్ తీసుకుంది అనుష్క. భాగమతి సినిమాతో తన రేంజ్ ఏంటో మరోసారి నిరుపించుకుంది.
అయితే భాగమతి తరువాత ఇప్పటి వరకు అనుష్క మరో సినిమా ఒప్పుకోలేదు. ఈ గ్యాప్లో అనుష్క పెళ్లికి రెడీ అయిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అలాంటిది ఏమి లేదని అనుష్కనే స్వయంగా ప్రకటించింది.
తాజాగా అనుష్క తన కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తోన్న సినిమాలో అనుష్క నటించనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో అనుష్కతో పాటు అమితాబ్ బచ్చన్, విక్రమ్, ఐశ్వర్య రాయ్ వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. జయం రవి, విజయ్ సేతుపతి అలాగే కీర్తి సురేష్ కూడా ఈ బడా మల్టీస్టారర్లో ప్రత్యేక పాత్రల్లో కనిపించనుంచనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను విడుదల చేయనున్నాడు మణిరత్నం.