Friday, April 26, 2024
- Advertisement -

రీ ఎంట్రీ ఇస్తున్న కలర్స్ స్వాతి

- Advertisement -

కలర్స్ స్వాతి మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించబోతోంది. చాలా కాలంగా నటనకు దూరంగా ఉంటూ వస్తున్న స్వాతి.. రీ ఎంట్రీకి సిద్ధమవుతోంది. కలర్స్ ప్రోగ్రామ్‌తో పాపులర్‌ అయి… అదే తన ట్యాగ్‌గా మార్చుకున్న ఈ భామ .. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్‌ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాతో ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేసింది.

ఆ తర్వాత హీరోయిన్‌గా మారి ‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘త్రిపుర’ లాంటి సూపర్ హిట్ మూవీస్‌తో పేరు తెచ్చుకుంది. అలాగే, మలయాళంలో ‘మోసాయిలే’, ‘కుదిర మీనుగళ్’, ‘నార్త్ 24 కాతమ్’, ‘త్రిషూర్ పూరమ్’, ‘ఆమెన్’ లాంటి హిట్ మూవీస్ చేసింది. కెరీర్ పీక్‌లో ఉండగా పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పింది.

తాజాగా మంత్ ఆఫ్ మధుతో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ మూవీలో నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్నాడు. శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -