పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ మూవీ ప్రమోషన్స్ లో ప్రస్తుతం ప్రభాస్ బిజీబిజీ గా ఉన్నాడు. ఇందులో భాగంగా అభిమానులను ఇంటరాక్ట్ అవుతున్నాడు. ప్రమోషన్స్లో భాగంగా మీడియా అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ.. తన అప్కమింగ్ సినిమా విశేషాలను కూడా పంచుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ సెట్స్పై ఉన్నాయి.
తాజాగా సలార్ మూవీపై అప్ డేట్ ఇచ్చాడు ప్రభాస్. ‘కేజీఎఫ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్తో కలిసి ప్రభాస్ చేస్తున్న చిత్రమే ‘సలార్’. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చినా కూడా ఇప్పటికీ దీని నుండి పెద్దగా అప్డేట్స్ ఏమీ బయటికి రాలేదు. అయితే తాజాగా ఈ సినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్ ఉండబోతున్నాడన్న విషయాన్ని బయటపెట్టాడు ప్రభాస్.
పృథ్విరాజ్.. సలార్ సినిమాను ఒప్పుకున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని, థాంక్స్ చెప్పాడు ప్రభాస్. అంతే కాకుండా రాధే శ్యామ్ మలయాళం వర్షన్కు పృథ్వి వాయిస్ ఓవర్ ఇస్తున్నాడన్న విషయాన్ని కూడా స్పష్టం చేశాడు.