బాలీవుడ్లో హీరోల కన్నా హీరోయిన్లే ఎక్కువుగా వార్తల్లో నిలుస్తున్నారు.హీరోలతో సమానంగా పారితోషకంతోపాటు వివాదాలను కూడా పంచుకుంటున్నారు అక్కడి హీరోయిన్లు.బాలీస్టార్ హీరోయిన్ దీపిక పదుకునే ,హీరో రణ్వీర్ సింగ్ల పెళ్లి ఈ నెల 14, 15 జరగనుందని తెలుస్తుంది.వీరి పెళ్లి ఇటలిలో జరగనుంది.దీపిక, రణవీర్ లకు సన్నిహితులైన వారు ఇప్పటికే ఇటలీ చేరుకున్నారు. బాలీవుడ్ నుండి కొందరు స్టార్లకు ఈ జంట వెడ్డింగ్ కార్డ్ అందించింది. కానీ హీరోయిన్ కత్రినాకి మాత్రం కార్డ్ అందలేదని సమాచారం.
ఇటీవలే ఓ షోలో కత్రినా మాట్లాడుతు… దీపిక, రణవీర్ ల వెడ్డింగ్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్నట్లు, వారి వివాహ వేడుకల్లో పాల్గొనడానికి చాలా ఉత్సాహంగా ఉందని వెల్లడించింది. అయితే దీపిక , కత్రినాకి కార్డ్ ఇవ్వలేదట. దానికి కారణం కత్రినా,రణబీర్ కపూర్ లు విడిపోయిన తరువాత రణబీర్ తో దీపిక కొన్నాళ్లు డేటింగ్ చేసింది.ఆ సమయంలో కత్రినా ,దీపిక మధ్య విభేదాలు ఉన్నాయట.దీనిని మనస్సులో పెట్టుకునే దీపికా కత్రినాకు వెడ్డింగ్ కార్డు ఇవ్వలేదట.
,