Monday, April 29, 2024
- Advertisement -

Megastar Chiranjeevi : నెక్స్ట్ టార్గెట్ మెగాస్టారే.. బాబోయ్ మైండ్ బ్లాక్ అయ్యేలా డైరెక్టర్ స్కెచ్..!

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో అవకాశం తెప్పించుకోవడం ఒక ఎత్తైతే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవడం మరో ఎత్తు. అలా వచ్చిన ఛాన్స్ ని 100కి 100 శాతం వాడుకుంటున్న వారు చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి వారిలో డైరెక్టర్ అనీల్ రావిపుడి ఒకరు. ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా.. రైటర్ గా చేరిన అనీల్ పటాస్ తో కళ్యాణ్ రాం సినిమాతో డైరెక్టర్ గా మారాడు. ఆ సినిమా హిట్ అందుకోగా ఆ తర్వాత వరుస ఛాన్స్ లు అందుకున్నాడు. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు అంటూ తీసి హిట్ కొట్టాడు.

వింటేజ్ వెంకటేష్ ని పరిచయం చేస్తూ ఎఫ్2, ఎఫ్3 సినిమాలు చేశాడు. ప్రస్తుతం బాలకృష్ణతో భగవంత్ కేసరి అంటూ వస్తున్నాడు. ఈ సినిమా టీజర్ తోనే మరో హిట్ లోడింగ్ అనిపించేశాడు అనీల్ రావిపుడి. బాలయ్య హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా వస్తున్న భగవంత్ కేసరి సినిమా టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశాడు. ఇక ఈమధ్య వరుస హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న బాలకృష్ణ ఖాతాలో భగవంత్ కేసరి మరో సూపర్ హిట్ అందించడం పక్కా అని తెలుస్తుంది.

ఇదిలాఉంటే హిట్ డైరెక్టర్ కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలో అనీల్ రావిపుడికి వరుస అవకాశాలు వస్తున్నాయి. భగవంత్ కేసరి ప్రోమోస్ చూశాక మెగాస్టార్ చిరంజీవి నుంచి అనీల్ కి పిలుపు వచ్చినట్టు తెలుస్తుంది. చిరుని కలిసిన అనీల్ ఏదైనా కథ ఉంటే తీసుకురా చేద్దాం అని అన్నారట. సో మెగాస్టార్ ఆఫర్ కూడా దాదాపు కొట్టేశాడు అనీల్. చిరుని మెప్పించే కథతో వస్తే ఈ కాంబినేషన్ ఫిక్స్ అయినట్టే లెక్క. మామూలుగానే కామెడీ సినిమాలు చేసే అనీల్ చిరు మార్క్ టైమింగ్ తో కుదిరే సబ్జెక్ట్ ని ఎంచుకుంటే అదిరిపోతుంది.

భగవంత్ కేసరి తో కూడా అనీల్ హిట్ కొడితే మెగాస్టార్ సినిమా దాదాపు కన్ ఫర్మ్ అయినట్టే లెక్క. ప్రస్తుతం చిరు భోళా శంకర్ తర్వాత బింబిసార వశిష్ట డైరెక్షన్ లో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో కూడా మూవీ ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాను సుస్మిత నిర్మిస్తుందని టాక్. వశిష్ట సినిమా మాత్రం భారీ బడ్జెట్ తో ఫిక్షనల్ కథగా ఉంటుందని చెబుతున్నారు.

ఈ ఇయర్ మొదట్లో వాల్తేరు వీరయ్య్గా సూపర్ హిట్ అందుకున్న మెగాస్టార్ భోళా శంకర్ గా మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా చూపించాలని ఫిక్స్ అయ్యారు. మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగష్టు 10న రిలీజ్ అవుతుంది. సినిమాలో తమన్నా హీరోయిన్ గా చేస్తుండగా కీర్తి సురేష్ చిరుకి సిస్టర్ రోల్ లో నటిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -