- Advertisement -
తమిళ హీరో కార్తి ఖాకీ సినిమాతో చాలా కాలంగా తరువాత హిట్ కొట్టాడు.అదే ఊపును కొనసాగించాలని భావిస్తున్న కార్తి ఈసారి రైతుల సమస్యలపై పోరాడే వ్యక్తిగా రాబోతున్నాడు.కార్తి నటిస్తున్న తాజా చిత్రం ‘చినబాబు’.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్.
టీజర్లోనే ఇది రైతులకు సంబంధించినదిగా చెప్పేశారు.ట్రైలర్లో కూడా అదే చూపించారు. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కార్తి కామెడీతో పాటు యాక్షన్ కూడా ట్రై చేసినట్లున్నాడు. ఈ సినిమాలో తెలుగు నటుడు శత్రు విలన్ పాత్రలో కనిపించడం విశేషం. ఈ చిత్రం ఈ నెల 13న తమిళ-తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.