- Advertisement -
తెలుగు ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. ఇప్పటి వరకు పలువురు నటులు ఇతర సాంకేతిక వర్గానికి చెందన వారు కరోనా వైరస్ తో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ మద్యనే గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూశారు. తాజాగా హీరో, నిర్మాత యాదా కృష్ణ(61) కన్నుమూశారు. బుధవారం ఆయన గుండెపోటులో మృతి చెందారు. యాదా కృష్ణ 20పై పైగా చిత్రాల్లో నటించారు.
‘గుప్త శాస్త్రం’, ‘వయసు కోరిక’, ‘పిక్నిక్’ వంటి బి గ్రేడ్ సినిమాల హీరోగా నటించారు. ఆయన నటించిన సంక్రాంతి అల్లుడు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానే ఆకర్షించింది. సినే పరిశ్రమలో ఆయన ఎన్నో కష్టాలు పడ్డారని సహచరులు అంటుంటారు. దాంతో యాదా కృష్ణ కొంతకాలంగా సినిమాలకు దూరమయ్యాడు. కొన్నిచిత్రాలను స్వయంగా నిర్మించారు. యాదా కృష్ణ మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.