గత కొన్ని రోజులుగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఎన్టీఆర్ బయోపిక్లో ఆమె జయలలిత పాత్రను పోషించబోతుందని ,దీనికి అటు బాలయ్య, ఇటు కాజల్ కూడా ఓకే చెప్పారని వార్తలు వచ్చాయి.దీనిపై స్పందించిన కాజల్ ఆ వార్త నిజం కాదని ఆమె వివరణ ఇచ్చారు.‘ఎన్టీఆర్ బయోపిక్ కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. జయలలిత పాత్ర పోషిస్తున్నానన్న వార్తలో నిజం లేదు’ అని కాజల్ స్పష్టత ఇచ్చారు. దీంతో ఈ చిత్రంలో ఈ పాత్ర ఎవరు పోషించబోతున్నారన్న దానిపై ఆసక్తి మొదలైంది.
దిగ్గజ నటుడు, దివంగత నేత ఎన్టీఆర్ జీవితగాథగా ఎన్టీఆర్ చిత్రాన్ని దర్శకుడు తేజ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.కాజల్ అగర్వాల్ మొదటి సినిమాకు తేజ దర్శకత్వం వహించారు.పైగా రీసెంట్గా రానా హీరోగా నేనే రాజు నేనే మంత్రి సినిమా కూడా తేజనే దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా చేసింది. దీంతో తేజ మరోసారి కాజల్ అగర్వాల్కు తన తరువాత సినిమాలో అవకాశం ఇచ్చారని భావించారు.కాని ఇది అంతా రూమర్సేనని కాజల్ స్టేట్మెంట్తో తెలిపోయింది.