తమిళ తంబి జీవా ఎప్పుడూ టెక్నికల్ ఫిలింస్ చేస్తూ ఉంటాడు. గతంలో ఈ లాంటి మెడికల్ బేస్డ్ చిత్రం చేసి సూపర్బ్ అనిపించాడు. ఆతరువాత ఒకటి రెండు ఆతరహా ఎడ్వంచర్లు చేసినా ఏవి అంతగా వర్కవుట్ కాలేదు. కాని తాజాగా మనోడు బ్లూ వేల్ గేమ్ తరహా ప్రమాదకర ఆన్ లైన్ క్రీడల గురించి ఓ సినిమా చేస్తున్నాడు. అదే కీ.
ఈ మాదిరిగానే కీ చిత్రాన్ని పూర్తిస్థాయి ప్రయోగాత్మక చిత్రంగా మలచబోతున్నాడు. టెక్నాలజీతో వ్యక్తిగత జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందన్న స్టోరీతో తెరకెక్కిన మూవీనే ‘కీ’. ఈసినిమాను టీజర్ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేసింది. రిలీజైంది.
బ్లూవేల్ గేమ్, టీనేజీ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన విషయాలను కళ్లకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్. టీజర్ చూస్తే టెక్నాలజీ వల్ల వచ్చే అనర్థాలను చూపించనున్నట్లు తెలుస్తోంది. ట్రెండ్కు తగ్గట్టుగా టీజర్ వుండడంతో మూవీపై అంచనాలు ఓ స్థాయిలో ఉన్నాయి. నిక్కీ గల్రాని హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి కలీస్ డైరెక్టర్. రాజేంద్రప్రసాద్, సుహాసిని కీలకపాత్ర పోషిస్తున్నారు.