ఫిబ్రవరి 9న మూడు, నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్న ఫోకస్ మొత్తం రెండు సినిమాల మీదే ఉంది. అవి కూడా మెగా హీరోల సినిమాలు కావడంతో అభిమానులలో ఆసక్తి పెరింగింది.మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్,మెగా బ్రదర్నాగబాబు కొడకు వరుణ్ తేజ్ ఇద్దరు ఓకే తేదిన వస్తుడంటంతో ఎవ్వరి సినిమా పై చేయ్యి సాధిస్తుందో చూడాలి.
ఫిదాతో హిట్ కొట్టిన వరుణ్ తేజ్ తొలిప్రేమతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.పవన్ కళ్యాణ్ బ్లాక్ బ్లస్టర్ సినిమా తొలిప్రేమ టైటిల్తో వరుణ్ తేజ్ వస్తుడంటంతో పవన్ అభిమానులు సపోర్టుగా ఉంటారు అని చిత్ర యూనిట్ భావిస్తుంది.
ఇకా సాయి ధరమ్ తేజ్ మాస్ ఫోలోయింగ్ కోసం ఎప్పటినుండో ప్రయత్నం చేస్తున్నాడు.కాని తన ప్రయత్నాలు అన్ని ఫెయిల్ అవుతున్నాయి.ఈ సారి మాస్ డైరక్టర్ వివి వినాయక్ డైరక్షన్లో ఇంటిలిజెంట్ సినిమాతో 9న ప్రేక్షకుల ముందుకు వస్తుననాడు సాయి ధరమ్ తేజ్. వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడుతున్న తేజ్కు ఈ సినిమా పై ఆశ పెట్టుకున్నాడు. వినాయక్ డైరక్టర్ కావడంతో సినిమాపై మంచి బజ్ ఉంది.
అయితే ఈ రెండు సినిమాలపై అంచనాలు సమానంగా ఉన్నాయి. వీటితో పాటు నిఖిల్ కూడా కిర్రాక్ పార్టీతో థియెటర్లలోకి వస్తుడంటంతో చూడాలి ఏ సినిమా ఎలా ఉంటుందో. 2017లో చిన్న సినిమాలు మంచి హిట్ సాధించటంతో 2018లో కూడా చిన్న సినిమాలు తమ హవ సాధించాలని కోరుకుందాం.