Sunday, April 28, 2024
- Advertisement -

ఒకే ఫ్రేమ్‌లో నమ్రతా,ప్రణతి!

- Advertisement -

టాలీవుడ్ అగ్రహీరోలందరిని ఒకే ఫ్రేమ్‌లో చూసుంటాం. ఏదైనా ఆడియో,ప్రీరిలీజ్ ఈవెంట్ అయితే అగ్రహీరోలు ఒకే వేదికపై కలిసి ఉండటాన్ని ఎంజాయ్ చేసుంటాం. కానీ అదే అగ్రహీరోల భార్యలు కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం చాలా అరుదు. ఒకవేళ కనిపించినా ఆ ఫోటోలు బయటకు రావు. అయితే తాజాగా ఇద్దరు అగ్రహీరోల భార్యలు ఒకే ఈవెంట్‌కు హాజరై సందడి చేశారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమత్రా, జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి ఒక వివాహ కార్యక్రమంలో సందడి చేశారు. వీరిద్దరికి కామన్ ఫ్రెండ్ మ్యారేజ్ యానివర్సరీ ఫంక్షన్ లో ఇతర ఫ్రెండ్స్ తో కలిసి నమ్రత, ప్రణతి సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక రామ్ చరణ్ భార్య ఉపాసన, మహేష్ భార్య నమత్రా ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతుందటారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి మాత్రం సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. అలాంటిది నమ్రతతో కలిసి ఫోటో షేర్ చేసుకోవడం అభిమానుల్లో జోష్ నింపుతోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -