నందమూరి కుటుంబంలో గత కొంతకాలంగా వస్తున్న విభేదాలకు ఫుల్స్టాప్ చెప్పనున్నారు నందమూరి హీరోలు. బాలయ్యకు ఎన్టీఆర్కు మధ్య మాటలు లేవని అందరికి తెలిసిందే. అయితే హరికృష్ణ మరణంతో ఎన్టీఆర్ కుటుంబానికి దగ్గరైయ్యారు బాలయ్య. దీనిలో భాగంగానే ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా సక్సెస్ మీట్కు ముఖ్య అతిథిగా బాలయ్య వస్తున్నారని సమాచారం.
ఎన్టీఆర్, పూజాహెగ్డే కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, హైదరాబాదులోని శిల్పకళా వేదికలో చిత్ర విజయోత్సవ సభను రేపు నిర్వహించనున్నారు. చాలా ఏళ్ల తర్వాత బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ లు ఒకే వేదికపై కనిపించనున్నారనే వార్త తెలియగానే నందమూరి ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. గతంలో బాలయ్య సినిమా ‘సింహా’కు సంబంధించిన కార్యక్రమానికి తారక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ మీట్కు హీరో కల్యాణ్ రామ్ కూడా రానున్నారు.