Tuesday, April 30, 2024
- Advertisement -

ఎన్టీఆర్‌కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నారా బ్రాహ్మణి…!

- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ,మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమా అర‌వింద స‌మేత‌.ద‌స‌రా కానుక‌గా విడుద‌లై ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది.విడుద‌లైన మొద‌టి రోజేనే 60 కోట్లు క‌లెక్ట్ చేసి, నాన్‌- బాహుబ‌లి రికార్డుగా నిలిచింది.సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో చిత్ర యూనిట్ సినిమా స‌క్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు.ఆదివారం జ‌రిగిన సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా బాల‌య్య వ‌చ్చారు.గ‌తంలో బాల‌కృష్ణ కుటుంబానికి ,హ‌రికృష్ణ కుటుంబానికి మ‌ధ్య సంబంధాలు సరిగా లేవ‌ని అంద‌రికి తెలిసిందే.హ‌రికృష్ఱ మ‌ర‌ణంతో ఆయ‌న కుటుంబానికి బాల‌య్య ద‌గ్గ‌ర‌వ్వ‌డం జ‌రిగింది.

తాజాగా ఈ సినిమాను చూసిన బాలయ్య కుమార్తె, నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి తన అన్నయ్య తారక్‌పై ప్రశంసలు కురిపించారు. దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ కూడా పంపారు బ్రాహ్మణి.ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించిన తన పెదనాన్న హరికృష్ణ పాత ఫొటోలను సేకరించి, వాటిని ఆల్బమ్ గా చేయించి, సీడీ రూపంలో ఎన్టీఆర్ కు బ్రాహ్మణి పంపించారు. ఆ ఫొటోలను చూసిన తారక్ ఉద్వేగానికి లోనయ్యాడు. చెల్లెలు బ్రాహ్మణికి కృతజ్ఞతలు తెలిపాడు.వీరి ప్రేమ ఎప్ప‌టికి ఇలానే కొన‌సాగాల‌ని నంద‌మూరి అభిమానులు కోరుకుంటున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -